
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల తమ మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఎన్టీయార్ భవన్లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, తెలుగుదేశం పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి మరియు అరవింద్ కుమార్ గౌడ్ గార్ల సమక్షంలో సోమవారం పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని రమణ గుర్తు చేశారు. మాటలకే పరిమైన టీఆర్ఎస్ పార్టీ కావాలో.. అభివృద్ధి చేసే తెలుగు దేశం పార్టీ కావాలో ప్రజలు ఆలోచించాలని ఆయన సూచించారు.టీడీపీని గెలిపిస్తే ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా చేయడంతో పాటు పేదలందరికీ ఉచిత నల్లా కనెక్షన్ ఇస్తామని ఎల్ రమణ ప్రకటించారు. పూర్తి స్థాయిలో వైఫై నగరంగా చేయడానికి కృషి చేస్తామని, అలాగే ప్రతి ఇంటికి పైపులైన్ల ద్వారా వంట గ్యాస్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి పేదవారికి పక్కా గృహాలు నిర్మిస్తామన్నారు.టీడీపీ విడుదల చేసిన పూర్తి మేనిఫెస్టో ఇదీ..